40.2 C
Hyderabad
May 6, 2024 16: 01 PM
Slider విజయనగరం

ఆ జిల్లా కేంద్రంలో పొద్దున్నే ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ని…! అదేంటంటే…?

#trafficpolice

ప్ర‌తీ రోజూ,అనునిత్యం ఎవ‌రు ప‌ని చేస్తున్నారంటే..రోజూ క‌నిపిస్తున్న వాళ్లే..వారే  పోలీసులు. అందునా ట్రాఫిక్ పోలీసులు. ఈ క‌రోనా స‌మ‌యంలో   క‌నీసం కొన్ని గంట‌లైనా లాక్ డౌన్ పుణ్య‌మా ఊపిరి పీల్చుకుంటున్న‌దెవ‌రంటే…ట్రాఫిక్ పోలీసులు.

కానీ దురదృష్టం వారిని వెంటాడింద‌నే చెప్పాలి. విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల‌కు 20 వ తేదీన పొద్దున్నే  ప‌ని త‌గిలింది. రోజూ వారి విధుల‌కు ఎల్ల‌ప్పుడూ డీఎస్పీ లేక స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ కేటాంయించిన స‌మయానికే పాయింట్ల‌కు చేరుకుంటూ ఉంటారు…ట్రాఫిక్ సిబ్బంది.

కానీ  20 వ‌తేదీన ఉద‌యం ఏడుగంట‌ల‌కు ముందే కంట్రోల్ రూమ్ కు వ‌చ్చిన స‌మాచారంతో విజ‌య‌న‌గ‌రం ట్రాఫిక్ విభాగం అలెర్ట్ అయ్యింది. అదీ బ్యారెక్స్ వ‌ద్ద‌..దిశ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద  ఓ పౌడ‌ర్ తో విశాఖ నుంచీ ఒడిషాకు వెళుతున్న  ఓ  గూడ్స్ లారీ…అదే రూట్ లో వెళుతున్న ఓ కారు ఈడ్చుకెళ్లిందంటూ మెసేజ్ వచ్చింది.

దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్ర‌మ‌త్తం అయి…కానిస్టేబుల్ ప‌ర‌శ‌న్న మ‌రో కానిస్టేబుల్ ఉన్న ప‌ళంగా ఘ‌ట‌నా స్థ‌లికి వ‌చ్చింది…డీటైల్స్ నోట్ చేసుకుని ఎస్ఐ ద్వారా డీఎస్పీకి స‌మాచారం పంపించారు. లారీ య‌జ‌మాని ఓడిషాకు చందిన వారు కావ‌డం… డ్రైవ‌ర్ ద్వారా పూర్తి స‌మాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు  త‌క్ష‌ణం కేసు క‌ట్టారు.

కారు య‌జ‌మాని, డ్రైవ‌ర్ ఒక్క‌రే కావ‌డంతో అతని వ‌ద్ద నుంచీ పూర్తి స‌మాచారాన్ని ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నారు. స‌ద‌రు  య‌జ‌మాని వ‌చ్చేంత వ‌ర‌కు ఓడిషాకు చెందిన గూడ్స్ లారీని సంఘ‌ట‌నా స్థ‌లం నుంచీ తీయొద్దంటూ డ్రైవ‌ర్ ను ట్రాపిక్ పోలీసులు ఆదేశించి…కారు య‌జ‌మానికి రాత పూర్వక ఫిర్యాదు కొర‌కు ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ కు పంపించారు..సిబ్బంది.

అయితే పొద్దున్నే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టికీ కారుకు త‌ప్ప మ‌రెవ్వ‌రికీ ఎటువంటి అపాయం జ‌ర‌గ‌క పోవ‌డంతో అటు ట్రాఫిక్ పోలీసులు ఇటు న‌గ‌ర ప్ర‌జ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

రెంటికీ చెడ్డ రేవడి….. పాపం… చినజియర్ స్వామి….

Satyam NEWS

ధర్డ్ వికెట్: యనమల రామకృష్ణుడిపై ఎస్ సి ఎట్రాసిటీ కేసు

Satyam NEWS

లక్కీ మీడియా బ్యానర్ ఫలక్ నుమా హీరో

Satyam NEWS

Leave a Comment