రామంతాపూర్ డివిజన్ లోని అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని ఎల్బీనగర్ ఈస్ట్ జోనల్ కమీషనర్ పంకజ ను మాజీ కార్పోరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంధం జోష్ణ నాగేశ్వరరావు కమిషనర్ తో డివిజన్లోని సమస్యల గురించి చర్చించారు. రామంతాపూర్ డివిజన్ కి సంబందించి వివేక్ నగర్ మెయిన్ రోడ్ నుండి కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ వరకు సీసీ రోడ్,ధోబీఘాట్ నుంచి రాజేంద్రనగర్ వరకు సీసీ రోడ్,ఈస్ట్ శ్రీనివాస్ పురం లో సీసీ రోడ్, రాంశంకర్ నగర్, ఈస్ట్ శ్రీనివాపురం లో స్ట్రామ్ వాటర్ డ్రైన్ లైన్, భరత్ నగర్ లో మనస్వి మేడికల్ స్టోర్ నుండి జీడీ బేకరీ వరకు VDCC రోడ్ పనులగురించి జోనల్ కమీషనర్ పంకజ కి వివరించారు. కమిషనర్ సమస్యలపై సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా