తెలంగాణా రాష్ట్రంలో భవిష్యత్తు బిజెపిదేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంధర్ రెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్ స్థాయి కార్యకర్తలే అన్నారు.
కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పని చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రజలు అధికార బీఆర్ ఎస్ పార్టీతో విసిగిపోయారని అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, భవిషత్తు బీజేపిదేననన్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేసి జిల్లాలోని 4 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాబోయే రోజుల్లో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పర్యటించే అవకాశం ఉందన్నారు.