జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో గంగపుత్రుల సమస్యలపై నియోజకవర్గంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ని అంబర్ పేట నియోజకవర్గం సంబంధించిన గంగపుత్రులు కార్పొరేటర్ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు పాక నర్సింగ్, పాక సంతోష్, సందీప్, బాల్రాజ్, చరణ్, దత్త, బిజ్జి నరేష్, కిషన్, చందు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్