నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సింగిల్ విండో ఛైర్మెన్ చింతకుంట శ్రీనివాసులు అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కును నేడు ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన హైమావతి w/o శేఖరాచారి కి రూ.1,00,000/- చెక్కును అందచేశారు.
సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్బంధువులలా ఆదుకుంటుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.
ఈ సందర్బంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో సింగిల్ విండో చెర్మెన్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డి వెంకటస్వామి, నరసింహ చారి పాల్గొన్నారు.