సంక్షేమం పేరుతో ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పన్నుల పేరుతో తిరిగి వసూలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
విజయవాడలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆయన నేడు మీడియా సమావేశంలో మాట్లారు. చెత్త ప్రభుత్వాలకు చెత్త మీద పన్నులు వేసి వసూలు చేసుకోవాలనే ఆలోచన వస్తుందని ఆయన అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చెత్తపై పన్ను వెయ్యలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందని విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు.
మునిసిపల్, కార్పొరేషన్లలో పన్నుల పెంపుకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామన్ని ఆయన తెలిపారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే చర్యలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
సంస్కరణలు అమలు చెయ్యమని కేంద్రం చెప్పింది కానీ ప్రజలపై భారాలు వెయ్యమని చెప్పలేదని ఆయన అన్నారు.