సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతికి లక్నో న్యాయస్థానం జీవితఖైదు విధించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు అశోక్ తివారీ, ఆశిష్ శుక్లాలకు కూడా యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2లక్షల జరిమానాను విధించింది.
ఇదే కేసులో నిందితులైన వికాశ్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్, చంద్ర పాల్పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులను గురవారమే దోషులుగా నిర్ధారించిన ఈ కేసు కోసం న్యాయస్థానం మొత్తం 17 మంది సాక్షులను విచారించింది.