39.2 C
Hyderabad
May 3, 2024 11: 40 AM
Slider ఆదిలాబాద్

కొమరం భీమ్ ఎస్పీ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

#Komaram Bheem SP office

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డా.బాబు జగ్జీవన్ రామ్ మహనీయుడు, స్వతంత్ర సమరయోధుడు, గొప్ప సంఘసంస్కర్త అని తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా కూడా దేశానికి సేవలు అందించారని అన్నారు.

ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారని, విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా గాంధీతో కలిసి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారని, మొదటి మంత్రివర్గంలో స్థానం సంపాదించి దేశానికీ సేవలు అందించారని అన్నారు. కరువు కోరల్లో చిక్కిన భారతావనికి వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సహకారం చేసి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని, యావత్ భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారని ఇటువంటి మహనీయుల ఆశయాలను మనమందరం ముందుకు తీసుకపోవాలని, వారు దేశానికి చేసిన సేవలని యువత, స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ఫోర్స్ సి.ఐ సుధాకర్, ఆర్.ఐ అడ్మిన్ భరత్ భూషణ్, ఆర్.ఐ ఎం.టి.ఓ శ్రీనివాస్, డి.సి.ఆర్.బి ఎస్.ఐ లావణ్య, ఆర్.ఎస్.ఐ లు కిరణ్ , రాజశేఖర్, రాజేష్,పోలీస్ సిబ్బంది పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Related posts

పర్యావరణాన్ని కాపాడుకుందాం కలిసి రండి

Satyam NEWS

మునుగోడు లో 100కు పైగా నామినేషన్లు

Satyam NEWS

వెంకటగిరి పట్టణానికి వెలుగులు నింపిన తిరుపతి ఎంపీ

Satyam NEWS

Leave a Comment