నెల్లూరు నగరం 6వ డివిజన్ లోని స్టోన్ హౌస్పేట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ.. డివిజన్లోని షాపులు, ఇంటింటికి తిరిగి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ 2024లో టీడీపీ గెలుపుకు సహకరించాలని కోరారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజన్లో పర్యటించినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం హేమమైన చర్య అన్నారు. వైసిపి నేతలు కావాలని డిబేట్లో రండి చాలెంజ్లు విసురుతున్నారని డిబేట్లకు రావలసిన అవసరం నాకు లేదని స్ఫష్టం చేశారు. ఎందుకంటే నెల్లూరును అభివృద్ధిని చేసింది నేనని తేల్చి చెప్పారు.
previous post