37.7 C
Hyderabad
May 4, 2024 12: 22 PM
Slider నెల్లూరు

కావాల‌నే వైసీపీ నేత‌లు రెచ్చ‌గొడుతున్నారు

#narayana

నెల్లూరు న‌గ‌రం 6వ డివిజ‌న్ లోని స్టోన్ హౌస్‌పేట త‌దిత‌ర ప్రాంతాల్లో మాజీ మంత్రి, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయ‌ణ‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిలు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌.. డివిజ‌న్‌లోని షాపులు, ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల్ని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ 2024లో టీడీపీ గెలుపుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అనంత‌రం నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజ‌న్‌లో ప‌ర్య‌టించినా ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం హేమమైన చర్య అన్నారు.  వైసిపి నేతలు కావాలని డిబేట్లో రండి చాలెంజ్లు విసురుతున్నారని డిబేట్ల‌కు రావలసిన అవసరం నాకు లేదని స్ఫ‌ష్టం చేశారు. ఎందుకంటే నెల్లూరును అభివృద్ధిని చేసింది నేనని తేల్చి చెప్పారు.

Related posts

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి వేడుక

Satyam NEWS

టీడీపీ బస్ యాత్ర కు ఎండను సహితం లెక్క చేయకుండా…!

Bhavani

కొల్లాపూర్ పోలీసులపై జర్నలిస్టు రాజశేఖర్ ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment