విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సీఎం జగన్ అకస్మాత్తుగా వచ్చారు. నిన్న జిల్లా లోని కంటకాపల్లి వద్ద జరిగిన రెండు రైళ్ల ప్రమాద ఘటనలో క్షతగాత్రులు ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు చికిత్స పొందుతున్న వారిని సీఎం జగన్ పరామర్శించేందుకు విజయనగరం హాస్పిటల్ కు వచ్చారు. అయితే ఘటనా స్థలానికి వెళ్లాలని అనుకున్న…అక్కడ శాఖ సిబ్బంది కి…ఇబ్బందులు కలుగుతాయని…నేరుగా విజయనగరం హాస్పిటల్ కు వచ్చారు సీఎం జగన్ కు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, మంత్రి బొత్సలు…స్వాగతం పలికారు. అక్కడే కంటకాపల్లి ప్రమాద ఘటన దృశ్యాలను ఐ అండ్ పీఆర్ ఏర్పాటు చేయడంతో వాటిని తిలకించి…సీఎం జగన్…. హాస్పిటల్ లోపలకు వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు.
previous post