29.7 C
Hyderabad
May 1, 2024 07: 02 AM
Slider మెదక్

ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం

#murdercase

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. ఆయన దుబ్బాక అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి వెళ్లారు. అక్కడ ప్రచారం చేస్తుండగా జి రాజు అనే వ్యక్తి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తేరుకొని పై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని  గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ  చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్నందున  మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి  తరలించడం జరిగింది. హత్యయత్నం చేసిన జి రాజు పై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

అమరావతి రైతుల పాదయాత్రకు ‘‘అగ్ని పరీక్ష’’

Satyam NEWS

ఏపిలో జర్నలిస్టులపై మూడు సెంట్ల మాయాజాలం

Satyam NEWS

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS

Leave a Comment