కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్ ఎం. వద్ద వేగంగా వస్తున్న కారు ఒక ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. బస్సు టైరు అకస్మాత్తుగా పేలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బస్సు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన బస్సును వేగంగా వస్తున్న కారు ఢీకొన్నది.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారితో ఆ ప్రాంతం అంతా భీభత్సంగా మారి ఉంది. శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయి ఉన్నాయి. హృదయ విదారకంగా సంఘటనా స్థలం మారింది. ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.