38.2 C
Hyderabad
May 2, 2024 19: 30 PM
Slider పశ్చిమగోదావరి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం

జర్నలిస్ట్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని నిడదవోలు ఎమ్మెల్యే
జి.శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. నిడదవోలు రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కల్యాణ మండపంలో నిడదవోలు వర్కింగ్ జర్నలిస్టుల నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షుడిగా
పెన్మెత్స చందు, అధ్యక్షుడిగా శ్రీరంగం వీరేంద్ర కార్యదర్శిగా ముప్పిడి రవితేజ. ఉపాధ్యక్షులుగా ఎల్లే రాజు, అనుపోజు శివశంకర్, కోశాధికారిగా సజ్జల గంగాధర్, సంయుక్త కార్యదర్శిగా షేక్ సిరాజుద్దీన్ ప్రమాణం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే
జి.శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్ట్ లు పనిచేయాలన్నారు. నిడదవోలులో ఆర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలతో , ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సమాజానికి దిక్సూచి గా
పనిచేయాలన్నారు.

Related posts

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి

Satyam NEWS

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ కు భారీగా ఉద్యోగులు….

Satyam NEWS

Leave a Comment