ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి,
మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, పథకాల అమలులో వేగం పెంచాలని, నిర్దేశించిన సమయం లోగా లక్ష్యం పూర్తికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.