బిజెపి బలం పెరిగినా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్ధిని రంగంలో దించే ప్రయత్నం చేస్తున్నది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా పరిధిలో గల భారతి నగర్ డివిజన్ 111 నుండి గెలుపొందిన సింధు ఆదర్శ్ రెడ్డి మేయర్ గా ఎంపికవ్వబోతున్నారనే వార్త ప్రచారం జరుగుతోంది. నగరం నుండి కొందరు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖుల భార్యలు ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మేయర్ స్థానానికి కొంత పోటీ తగ్గినట్లు తెలుస్తోంది.
సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం సింధు ఆదర్శ్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.