కాప్రా పరిధిలోని ప్రతి ఒక్క వ్యాపారస్తులు జిహెచ్ఎంసి ట్రేడ్ లైసెన్స్ విధిగా తీసుకోవాలని కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శంకర్, ఏ ఎం ఓ హెచ్ స్వప్న రెడ్డి లు స్పష్టం చేశారు. బుధవారం కాప్రా సర్కిల్ సమావేశ మందిరములో మున్సిపల్ సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డి సి. శంకర్, ఏ ఎం ఓ హెచ్ స్వప్న రెడ్డి లు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్క వ్యాపారస్తులు జిహెచ్ఎంసి ట్రేడ్ లైసెన్స్ విధిగా తీసుకోవాలని సూచించారు. సర్కిల్ పరిధిలోనీ అనాథరైజ్ వ్యాపార షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలని సిబ్బంది కి సూచించారు.
ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులను మోటివేట్ చేసి లైసెన్సు తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఏ లు, జవానులు, ఎస్. నాగరాజు, ఎ ఎల్ ఒ. నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.