హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతాం రాయి వద్ద భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పొగాకు పదార్ధాలు అక్రమంగా నిలువ ఉంచిన గోదాం పై శంషాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడి చేశారు.
పట్టుబడ్డ పోగాకు, ముడిసరుకుల విలువ19 లక్షల వరకూ ఉంటుందని ఎస్ఓటి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఒక లారీ ని సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. షేక్ మక్బూల్, దయానిథి స్వామిని అరెస్ట్ చేయగా తప్పుస్వామి అనే వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.