మూడు కాకపోతే 30 రాజధాని పెట్టుకోమనండి. బస్ వేసుకొని తిరిగి తిరిగిన చోటల్లా రాజధాని పెడుతున్నామని చెప్పమనండి. ఎక్కడి నుండి పాలన జరిగితే అదే రాజధాని అవుతుంది. కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావు అంటూ ప్రముఖ సీని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశారు.
మంచికో, చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారుగా ప్రజాధనం ఏడు వేల కోట్లు పెట్టారు. మరో రెండు వేల కోట్లు పెడితే అది పూర్తవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రతిపక్షంలో ఉండి వాళ్లే ప్రత్యేక హోదా అడగ మంటున్నారు అని ఆయన అన్నారు.
రాజధాని విషయం పక్కన పెడితే, అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకున్నారు ముందు ఆ సంగతి చూడండి అంటూ ఆయన అన్నారు. తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని ఆయన అన్నారు. ముందు సంస్కారవంతులుగా మారాలని నేను కోరుకుంటున్నాను అని భరద్వాజ అన్నారు.