270, 276 సర్వే నెంబర్లలో కేటాయించిన ఇండ్ల స్థలాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రెవెన్యూ డివిజన్ అధికారికి చింతలపాలెం గ్రామ ఇండ్ల స్థలాల సాధన కమిటీ నేతలు వినతి పత్రం అందజేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలో 2004 వ, సంవత్సరంలో నాటి ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ధృవీకరణ పత్రాలను అందచేశారని,నాటి నుండి నేటి వరకు నాటి అధికారులు మాకు కేటాయించిన ఇండ్ల స్థలం ఏక్కడ ఉందో,వాటి హద్దులు చూపించ లేదని,ఎన్ని మార్లు ఉన్నత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని చింతలపాలెం గ్రామ సమీపంలోని కొత్తగూడెం తండ గ్రామ పంచాయతీ స్థలం కేటాయించటం జరిగిందని, ప్రకృతి వనానికి మరొక స్థలం కేటాయించి, నిరుపేదలకు ఇచ్చిన స్థలాన్ని పరిశీలించి, మరొక మారు సర్వే చేయించి, మాకు కేటాయించిన ఇండ్ల స్థలం హద్దులను చూపించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ చింతలపాలెం గ్రామ ఇండ్ల స్థలాల సాధన కమిటీ RDO కి వినతిపత్రం అందజేశారు.