ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేవుడు అంటే కూడా నమ్మకం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు టీవీ చూసే తెలుసుకున్నా, రాష్ట్రంలో సీఎం జగన్ కు ఎవరు ఎదురు చెప్పినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ప్రతిపక్షం అనే కాదు స్వపక్షంలో వారు ఎదురు చెప్పినా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ ఆర్ధిక మూలాలు అన్నీ నాశనం చేశాడని దివాకర్ రెడ్డి అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాంఅని ఆయన తెలిపారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు, ఎవరైతే తమ దారిలోకి రారో వారందరికీ ఇలాంటివే ఉంటాయని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేదు.. ఆయనకు బైపాస్ అయింది.. జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన అన్నారు.