కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రజల కోసం ఆధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలను అందిస్తూ నిత్యావసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని తెలియజేసారు.
అనంతరం ఆసుపత్రి సిబ్బంది శాలువ కప్పి భాస్కర్ రెడ్డి ని సన్మానించారు.
ఈ కార్యక్రమములో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బాన్సువాడ మండల ఎఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ,
మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, మండల నాయకులు ఎజాజ్, బాబా, మున్సిపల్ కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.