మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ అంటూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కరెంట్ కోతల అంశం ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనల్లో కేసీఆర్ 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా? 24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలకు చెబుతున్నారని అన్నారు.
కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత ఉండనుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదని అన్నారు. ఇప్పటికీ నాకు కరెంట్ కోతపై నల్గొండ మండలం నుంచి పిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.