అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యా లయంలో రాజంపేటఅసెంబ్లీ జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు నేతృత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.రాజంపేట లోని జనసేన కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన రాయల్, పార్లమెంట్ ఇంచార్జీ ముఖరం చాంద్,అత్తిగారి దినేష్, వెంకటేశ్వర రావు,ఆధ్వర్యంలో సుమారు 52 కేజీల కేక్ ని కట్ చేసి సంబరాలు కార్య కర్తల సమక్షంలో జరుపు కున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కావాలని,అందుకు అందరి మద్దతు కావాలని కోరారు.ఇలాంటి జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ మరిన్ని జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్భంగా జనసేనకులు ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించి ఆసు పత్రిలోని పలువురు రోగులకు పండ్లు,బ్రెడ్,ఓ ఆర్ ఎస్ డ్రింక్స్ అంద జేశారు.పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన సైనికులు బాణాసంచా కాల్చుతూ కేక్ ని కట్ చేసి పంపిణీ చేస్తూ హంగామా చేశారు.ఈ కార్య క్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.