గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు భారతీయ జనతా పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై లైంగిక వేధింపుల కేసు మెడకు చుట్టుకుంది. దీంతో ఆయనను తప్పిస్తూ ముఖ్యమంత్రి సావంత్ నిర్ణయం తీసుకున్నారు.
ఈనేపథ్యంలోనే గోవా అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మిలింద్ నాయక్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిగేలా చూసేందుకు మంత్రి నాయక్ రాజీనామా చేశారు. మిలింద్ నాయక్కు లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపణలతో తన మంత్రిపదవికి రాజీనామా సమర్పించారు.