కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోయా కంది పంట తో పాటు వేలాది ఎకరాల పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం ఉపాధ్యక్షులు సురేష్ గొండా మాట్లాడుతూ వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని కావున ప్రభుత్వం తక్షణమే పంట నష్టపోయిన వాటి వివరాలను సేకరించి రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాలు ,విట్టల్,హనుమాన్ సింగ్ హరినాయక్ తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.