భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది.రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నది.,53 అడుగులకు చేరగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతో పాటు పొంగుతున్న వాగులు దాటకుండా బారికేడింగ్ చేశారు.
వరద ఉధృతి కొనసాగుతున్నదని, అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయని, ప్రజలు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది నుండి 12,86,136 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ డా ప్రియాంక అల తెలిపారు.