ఎగువ నుండి వస్తున్న వరదలతో గోదావరి క్రమ క్రమంగా పెరుగుతున్నదని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.
వరద ఉదృతి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని జాప్యం చేయక తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని ముంపు ప్రాంత ప్రజలకు కలెక్టర్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.