సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన ఒక సభ్యుడు నిండు ప్రాణాలను కాపాడారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం, మంగాపురం గ్రామానికి చెందిన కత్తి మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్లు రక్తం తక్కువగా ఉందని చెప్పారు.
అవసరమైన రక్తం ఉంటేనే ఆపరేషన్ చేస్తామని చెప్పటంతో బాధితులు హుజూర్ నగర్ లో ఉన్న దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్ ట్రస్ట్) వారికి ఫోన్ చేశారు. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు వెంటనే స్పందించి వారికి ట్రస్ట్ సభ్యుడు లక్ష్మణ్ ని, దగ్గుపాటి సురేష్ ని హైదరాబాద్ నాంపల్లి కేర్ ఆసుపత్రికి పంపి బ్లడ్ ఇప్పించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరపున బ్లడ్ ఇచ్చినందుకు ట్రస్ట్ సభ్యుడైన లక్ష్మణ్ కి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయాలి ప్రాణదాతలు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దగ్గుపాటి సురేష్, డిఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కత్తి సైదులు, తదితరులు పాల్గొన్నారు.