40.2 C
Hyderabad
May 2, 2024 18: 20 PM
Slider కర్నూలు

కొత్త మంత్రి గారూ, ఆదోనిలో రోగులకు ఆక్సిజన్ అందడంలేదు

#adonihospital

కరెంటు సమస్య కారణంగా కర్నూలు జిల్లా ఆదోని ఆస్పత్రిలో రోగులకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ విషయం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్య మంత్రి విడదల రజనికి ట్విట్టర్ ద్వారా భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ లో విద్యుత్‌ సమస్య కారణంగా ఆక్సిజన్ అందక ఆస్పత్రిలోని రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్‌ అందక నిన్న రాత్రి నుంచి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వ స్పందించలేదు. వైద్య ఆరోగ్య మంత్రి పదవి వచ్చినందుకు సంబరాల్లో మునిగి తేలుతున్నారో తెలియదు. రోగులను మాత్రం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. తక్షణమే అక్కడి రోగుల్ని ఆదుకోండి వైద్య శాఖామంత్రి విడదల రజనిగారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

Related posts

జర్నలిస్టును ఆదుకున్న ఆర్ధిక మంత్రి హరీష్ రావు

Satyam NEWS

పుట్లయ్య మృతితో దిగ్ర్భాంతి లో కార్మిక లోకం

Satyam NEWS

షోకాజ్ నోటీసు జారీ చేయడమే ఎల్ వి చేసిన తప్పు

Satyam NEWS

Leave a Comment