పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (చిన్న తిరుపతి) వెంకటేశ్వరస్వామి వారికి తలపై ఉన్న గోపురానికి బంగారు తాపడం (పూత) పెట్టడానికి విమాన గోపురం ట్రస్ట్ ను దేవస్థానం ఏర్పాటు చేసిందని ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ ట్రస్ట్ కి దాతలు బంగారం (పసిడి) రూపంలో లేదా నగదు రూపం లో అందచేయవచ్చు. దాతలు స్వయంగా దేవస్థానం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమాన గోపురం ట్రస్ట్ కార్య నిర్వహణాధికారి కి విరాళాలు అందజేయాలని ఈ ఓ తెలిపారు.
ఏలూరు నగరంలో శనగపప్పు బజారు లో మాధవ నగర్ కు చెందిన ఎన్ .లక్ష్మీ నరసింహారావు ఆదివారం సతీ సమ్మతం గా ద్వారాకాతిరుమల వచ్చి స్వామివారిని దర్శించి విమాన గోపురం ట్రస్ట్ కి 40.000 వేల రూపాయల నగదు ను అందజేశారని ఈ ఓ సుబ్బారెడ్డి ఆదివారం నాడు తెలిపారు.
విమాన గోపుర స్వర్ణమయ పథకం
ద్వారకా తిరుమల క్షేత్రం పురాణ ప్రసిద్ధమై త్రేతాయుగం నుండి అజమహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రమూర్తి మొదలగు పురాణ పురుషులచే ఆరాధించబడిన ప్రసిద్ధ పురాతన క్షేత్రం. ద్వారకా మహర్షి తపఃప్రభావ ప్రకటితమయిన ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా ఆర్తజన పరిరక్షకంగా, కొంగు బంగారంగా అలరారుతున్నది.
ఈ క్షేత్రములోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విమానగోపురం, పద్మావతి అమ్మవారి, విమాన గోపురమునకు, కలశాలకు బంగారు తాపడం చేయించాలని శుభ సంకల్పం చేయటం జరిగినది. అందుకు సుమారు రూ 28 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
అందువల్ల దాతలు శ్రీ స్వామి వారి విమాన గోపుర స్వర్ణమయ పథకమునకు ఇతోధికంగా విరాళములను బంగారం లేదా నగదు, చెక్, డి.డి.రూపంలో ఇచ్చి ఆలయ కార్యాలంనందు రశీదు పొందవచ్చు.
ఈ మహత్కార్యములో భాగస్వాములై శ్రీ స్వామి వారి కృపకు పాత్రులుకాగలరు. ఫోన్స్: 08829 271427, 08829 271469 Website : www.dwarakatirumala.org. కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకా తిరుమల.