తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త. తిరుమలలో భక్తుల దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భౌతిక దూరం పాటిస్తూ దేవదేవుడి దర్శనం చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నది.
6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అనుమతించాలని టీటీడీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.