బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన జిల్లా స్థాయి అధికారులు కరోనా వైరస్ నిర్మూలన కొరకు ఏర్పాటు చేసిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు తెలిపారు. శుభ్రపరిచిన వేడి వేడి వంటకాలు మాత్రమే భోజనం చేయాలని చేతులను సబ్బుతో ఎప్పటికప్పుడు కడుక్కోవాలని కరచాలనానికి దూరంగా ఉండాలన్నారు.
బాలింతలు గర్భిణులు చిన్నపిల్లలు వయో వృద్ధులకు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన సమూహం అధికంగా ఉండేచోట వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరమని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి చంద్రమోహన్రెడ్డి ఆర్డిఓ రాజేశ్వర్, సిఇవో చందర్నాయక్, మండల తహసీల్దార్ వెంకట్రావు ఎంపిడిఓ ఆనంద్, ఆరోగ్య బోధకులు దస్తిరా౦ వైద్యులు రవిరాజ్, సబ్ యూనిట్ అధికారి ఇంతియాజ్అలీ, యుడిసి నీలునాయక్ తదితరులు పాల్గొన్నారు.