23.7 C
Hyderabad
May 8, 2024 05: 41 AM
Slider నిజామాబాద్

గుడ్ వర్క్: కరోనా వైరస్ పట్ల అప్రమత్తతకు ప్రచారం

palmplate

బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన జిల్లా స్థాయి అధికారులు కరోనా వైరస్ నిర్మూలన కొరకు ఏర్పాటు చేసిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు తెలిపారు. శుభ్రపరిచిన వేడి వేడి వంటకాలు మాత్రమే భోజనం చేయాలని చేతులను సబ్బుతో ఎప్పటికప్పుడు కడుక్కోవాలని కరచాలనానికి దూరంగా ఉండాలన్నారు.

బాలింతలు గర్భిణులు చిన్నపిల్లలు వయో వృద్ధులకు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన సమూహం అధికంగా ఉండేచోట వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరమని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి చంద్రమోహన్రెడ్డి ఆర్డిఓ రాజేశ్వర్, సిఇవో చందర్నాయక్, మండల  తహసీల్దార్ వెంకట్రావు ఎంపిడిఓ ఆనంద్, ఆరోగ్య బోధకులు దస్తిరా౦ వైద్యులు రవిరాజ్, సబ్ యూనిట్ అధికారి ఇంతియాజ్అలీ, యుడిసి నీలునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెరాసకు మద్ధతు ఇవ్వండి

Sub Editor

రైతులపై బిజెపి దాడిని అందరూ ఖండించాలి: సిఐటియు

Satyam NEWS

తండా స్కూళ్లలో బాల వికాస సేవలు హర్షణీయం

Satyam NEWS

Leave a Comment