అన్నమయ్య జిల్లా రాజంపేట లో జనసేన ఇంచార్జీ మాలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాష్ట్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం డిజిటల్ క్యాంపెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రహారం,కొత్త బోయినపల్లి తదితర ప్రాంతాల్లో దెబ్బ తిన్న రోడ్లు వద్ద ప్లే కార్డులు చేత బట్టి మా రోడ్లు బాగు చేయండి సీఎం గారూ అంటూ వినాదాలు చేశారు. దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మూలంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఆరాతీశారు.ఈ కార్య క్రమంలో రాజంపేట జనసేన నేతలు పోలిశెట్టి శ్రీనివాసులు,కత్తి సుబ్బారాయుడు, బాస్కర్ పంతులు,తాళ్ళపాక శంకరయ్య, మనోహర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
previous post