దివంగత మహానేత, కేంద్ర మంత్రి, ఒబీసీ నాయకులు గోపినాథ్ ముండే జయంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం కార్యవర్గ సభ్యులు లవంగు ఆంజనేయులు, అంబర్ పేట వంజరి సంఘం వంజరి నాగరాజు నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ నాయకులు, అంబర్ పేట కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
గోపినాథ్ ముండేకే నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ లోక్ నేత గోపినాథ్ ముండే కేవలం వంజరి కులస్థులకే కాకుండా యావత్ దేశంలో ఓబీసీ వర్గాలకు చైతన్య పరిచి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. వారి ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లి భారత జాతిని ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా మన రాజకీయాలు ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో వెనకబడిన వారి కోసం గ్రామ గ్రామాణ పర్యటించి అందరినీ ఏకతాటి పై నిలిపిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో వంజరి సేవా సంఘం నాయకులు సల్వెరు కృష్ణ, ధర్మరాజు, వంజరి టు డే సురేష్, ఎడిటర్ రూప జ్యోతి, అనంతుల అనిల్, డిజి రాజు, రామన్ రాజు, వారే బాలు, వారే నాగరాజు, డాన్ శీను, ఎంకె.రాజు, ప్రకాష్ మధు, మహేష్, వెంకటేష్, నాగరాజు, మధుసూదన్, గణేష్, సటికే రాజు, కందారి అశోక్, శంకర్, లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట