వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 80 మంది అయ్యప్పలు ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు తరలి వెళ్లారు. ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో 42 మంది అయ్యప్పలు అలాగే చీర్ల జనార్ధన్ గురుస్వామి ఆధ్వర్యంలో మరో 25 మంది రాఘవేంద్ర గురుస్వామి ఆధ్వర్యంలో మరికొందరు స్వాములు శబరి యాత్రకు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ, మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్, ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు కాదా భారీగా ఇరుముడులు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తల్లి వచ్చారు.
దీంతో అయ్యప్ప స్వామి ఆలయం శరణు ఘోషతో మార్మోగిపోయింది. ఇరుముడి కార్యక్రమంలో నరేందర్ గురుస్వామి, చీర్ల జనార్ధన్, చీర్ల కృష్ణసాగర్, రఘు మా రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ సిద్ధాంతి, ఎల్బీ చారి, గురు స్వాములు అలాగే అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గట్టు వెంకన్న, లక్ష్మీనారాయణ, నందిమల్ల అశోక్, కటకం చంద్రుడు, గట్టు శశి, వినోద్ కుమార్ రెడ్డి, భూజల బాల్ రెడ్డి, ఈశ్వర్ యాదవ్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్