ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. “ సీనియర్ శాసనసభ్యులైన గంపగోవర్ధన్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గంప గోవర్ధన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… నిరాడంబరంగా, పేదలకోసం పనిచేసే వ్యక్తిత్వం గల వ్యక్తి,“ అని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
previous post