కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పర పల్లి కి చెందిన మేరువ శ్రీహరి ఫిలిప్పైన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మెరువ ప్రసాద్, వెంకట సుబ్బమ్మ ల కుమారుడు శ్రీహరి మెడిసిన్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. ఈ రోజు ఉదయం మదనపల్లె కు చెందిన శ్రీ హరి తో పాటు విద్యాభ్యాసం చేస్తున్న స్నేహితుడు ఈ దుర్వార్త ను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చేర వేసాడు. దీనితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు.
ఫిలిప్పైన్స్ నుంచి త్వరగా మృతదేహం రప్పించేందుకు తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. స్థానిక సి.ఐ హనుమంతు నాయక్ ను కలవగా తమ పరిధిలో లేదని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. దీనితో వైసీపీ కి చెందిన ఉప్పరపల్లె మాజీ ఎం.పి.టి.సి ,సర్పంచ్ అయిన మృతుని తండ్రి మెరువ ప్రసాద్ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి ని ఆశ్రయించారు.