డి ఈ ఓ కు వినతిపత్రం ఇచ్చిన టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ జర్నలిస్టుల పిల్లలకు కు పాఠశాల ఫీజు లో 50 శాతం రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు
అనంతరం జిల్లా అధికారి రాజు స్పందిస్తూ జర్నలిస్టుల సంఘం కోరిన విధంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ప్రోసిడింగ్ కాపీని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిద్దా గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్ బొంపల్లి ప్రవీణ్ గౌడ్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, నేషనల్ కమిటీ మెంబర్ కృష్ణ చారి , జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకర్, నాయకులు మోహన్, సునీల్ , ప్రవీణ్ తదితరులు ఉన్నారు.