ఉప్పల్ ప్రజలకు నాయకుడిగా కాకుండా మీ సేవకుడిగా పనిచేస్తానని, ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం కాప్రా సర్కిల్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ ఈసిఐఎల్ క్రికెట్ గ్రౌండ్లో మందుముల పరమేశ్వర్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ను కలిసి, ఒక్క సారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని, జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను వివరించారు. అనంతరం, కుషాయిగూడ హోల్ సేల్ మార్కెట్ కాంట యజమానులను కలిసి మద్దతు కోరారు. కార్యక్రమంలో బొజ్జ రాఘవ రెడ్డి, కొత్త అంజి రెడ్డి, సీతారాం రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్త, రమాకాంత్ రెడ్డి, కురెల్లి అశోక్ గౌడ్, దేవేందర్ గౌడ్, నరేందర్ గౌడ్, సాయిబాబా యాదవ్, కాప్రా బాబన్న, అశోక్ చారి పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా