గత నెల మొదటి వారంలో పార్టీ చెప్పిన విధంగా నే గుంతలున్న రోడ్లను పార్టీ అధ్యక్షుని పిలుపు మేరకు పూడ్చే చర్యలకు ఉపక్రమించినట్టు జనసేన పార్టీ నేత పాలవలస యశస్వి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో ని మయూరీ జంక్షన్ వద్ద గుంతలు పడ్డ రహదారి ని పూడ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులుండీ కూడా రోడ్ల ను బాగు చేయించాలన్న ఆలోచన రాకపోవడం దౌర్భాగ్యమన్నారు.
ఈ నేపథ్యంలో తమ పార్టీ నేత పవన్…రెండు ప్రాంతాల్లో రోడ్ల ను బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఆయన ఇచ్చిన పిలుపు తోనే జిల్లాలో మరమ్మతులకు గురైన రోడ్ల ను బాగు చేసే పనికి పార్టీ ఉపక్రమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, పార్టీ నేతలు పాల్గొన్నారు.