అహింసా, సత్యమార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిన హమానీయుడు గాంధీజీ అని హబ్సిగూడ కార్పోరేటర్ కక్కిరేణి చేతనహరీష్ అన్నారు. అన్ని మతాలు ,కులాలు ఒకటేనని చాటిచెప్పిన మహానుభావుడు మన గాంధీజీ అని రామంతాపూర్ కార్పోరేటర్ బండారు శ్రీవాణివెంకటరావు అన్నారు.
ఈ సందర్బంగా శనివారం జాతిపిత మహాత్మగాంధి 152 వ జయంతి వేడకలు పురస్కరించుకుని రామంతాపూర్లోని వెంకటరెడ్డినర్ బస్స్టాప్ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.