ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా అని దుయ్యబట్టారు.
మే7వ తేదీ తో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నదశలో వాల్యూవేషన్ డ్యూటీ లో ఉండే ఉపాధ్యాయులకు ఇఎల్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యం తో ప్రభుత్వం ఈవిధంగా డొంకతిరుగుడు గా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు ఆరోపించారు. ఈమేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
previous post