38.2 C
Hyderabad
April 29, 2024 22: 18 PM
Slider ప్రత్యేకం

దేవాదాయ‌శాఖ‌మంత్రి లేకుండానే విగ్ర‌హ‌,క‌ల‌శ‌,ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్ట‌…!

#ramateerdham

లిఫ్ట్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో కొండ‌పై ఆల‌స్యంగా వ‌చ్చిన మంత్రులు…!

స్థానిక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల‌తో స‌రిగ్గా 07.37 కు గొపురంపై క‌ల‌శ స్థాప‌న‌…!

స‌రిగ్గా ముహూర్తం స‌మ‌యానికి మూడూ ప్రారంభోత్స‌వాలు…!

విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్ధం నీలాచలం కొండ‌(బోడికొండ‌)పై  అనుకున్న‌స‌మయానికి  కోదండ రామాల‌యం లో  విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌,క‌ల‌శ స్థాప‌.,ధ్వ‌జ‌స్థంబం కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.అయితే నెల్లి మ‌ర్ల ఎమ్మెల్యే బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు ,ఎమ్మెల్సీల చేతుల మీదుగా  నీలాచలం కొండ‌పై  విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం వేద పండితులు ఉచ్ఛార‌ణ‌ల న‌డుమ ,శాస్త్రోక్తంగా జ‌రిగాయి.

అయితే స‌మయనికి ముందుగా కొండ దిగువ ప్రాంతానికి దేవాదాయ శాఖ మంత్రి మెట్టుస‌త్య‌నారాయ‌ణ వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌మ‌యానికి క‌రెంట్ లేక‌పోవ‌డంతో జ‌నేర‌ట్  ఉన్నా…లిప్ట్ ప‌ని చేయ‌లేక‌పోవ‌డంతో…దాని ద్వారా పైకి రావాల్సిన దేవాదాయ శాఖ మంత్రి దిగువ‌నే ఉండిపోయారు.కాని అనుకున్న స‌మయానికి నిర్ణ‌యించిన ముహూర్తానికి  సరిగ్గా ఉద‌యం 07.37 నిమిషాల‌కు విగ్ర‌హ ప్ర‌తిష్ట‌,క‌ల‌శ స్థాప‌న‌,ధ్వ‌జ‌స్థంభం  ప్ర‌తిష్ట‌కార్య‌క్ర‌మం ఒకేసారి ఏక కాలంలో పూర్తి చేసారు…తిర‌ప‌తి నుంచ వ‌చ్చిన అర్చ‌కులు.

Related posts

నిరాహారదీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం

Satyam NEWS

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

Satyam NEWS

భయమా?…..: నోరువిప్పని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment