28.2 C
Hyderabad
May 9, 2024 02: 44 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఓటరుగా మారిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

governor bishvabhushan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలో ఉండగా గవర్నర్ తో పాటు మహిళా గవర్నర్ సుప్రవ హరిచందన్ కూడా ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.

గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

అప్పటి కప్పుడే వివరాలను సరిచూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రధమ పౌరునికి అతి త్వరలోనే ఓటరు కార్డును అందచేస్తామని తెలిపారు.

Related posts

ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభం

Satyam NEWS

Good News: రష్యా ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం

Satyam NEWS

ఓడిపోయిన చోటు నుంచే గెలుస్తా: నారా లోకేష్

Satyam NEWS

Leave a Comment