ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక రోజు జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం కడప ఎయిర్పోర్టు నుంచి ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కాసేపు విశ్రమానంతరం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం ఎదుట అర్చకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు మేళతాలలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
శ్రీ కోదండరామ స్వామి దర్శనం అనంతరం రంగ మండపంలో అర్చకులు గవర్నర్ కు వేద ఆశీర్వాదం చేశారు. జేఈవో వీరబ్రహ్మం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందించి శేష వస్త్రం తో సత్కరించారు. అనంతరం గవర్నర్ కడప లోని అమీన్ పీర్ పెద్ద దర్గా దర్శనార్థం సాయంత్రం 4.40గం లకు రోడ్డు మార్గాన బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, ఎస్పీ అన్బు రాజన్, రాజంపేట ఎమ్యెలే మేడ మల్లికార్జున రెడ్డి, కడప, బద్వేల్ ఆర్డీఓలు ధర్మచంద్రా రెడ్డి, వెంకట రమణ, జిల్లా అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.