31.7 C
Hyderabad
May 2, 2024 08: 01 AM
Slider జాతీయం

బీజేపీలోకి మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా

పంజాబ్‌లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ క్రికెటర్‌ దినేశ్‌ మోంగియా బీజేపీలో చేరారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఫతేహ్‌ సింగ్‌ భజ్వా, బల్విందర్‌ సింగ్‌ లడ్డీ కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు.

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో వీరందరు బీజేపీలో చేరారు. ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు మాజీ క్రికెటర్‌ దినేశ్ మోంగియా. దేశ అభివృద్ధి కోసం బీజేపీ కంటే మరే ఇతర పార్టీ పనిచేయలేదన్నారాయన.

బీజేపీ భావజాలం, ఉత్తమ పని తీరుతో ప్రభావితమై బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు మోంగియా చెప్పారు. పంజాబ్ ప్రజల నుంచి మాకు పూర్తి మద్దతు లభిస్తుందని, మేం మరింత మెరుగ్గా రాణిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

Related posts

జేపీ నడ్డాకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Satyam NEWS

మనో సంకెళ్ళు

Satyam NEWS

ప్రజా పాలన దరఖాస్తు ఫారాల కొరత లేదు

Satyam NEWS

Leave a Comment