గౌడులు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఐక్యమత్యంతో ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నదని గౌడ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర జేఏసీ నాయకులు బొనగాని యాదగిరి గౌడ్ , జనగాం శ్రీనివాస్ గౌడ్,ఆనంతుల రమేష్ గౌడ్, గట్టు రమేష్ గౌడ్ లు అన్నారు. గౌడ సంఘాల జేఏసీ సమావేశం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో పులి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముందు ఉన్నటువంటి గౌడ కులస్తులు ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్నటువంటి గౌడ కులస్తులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు గౌడలు జనాభా ప్రాతిపదికన తగిన గుర్తింపు ఇవ్వాలని లేని పక్షంలో తగిన గుణపాఠాలు చెప్పే అటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి గౌడ జేఏసీ హెచ్చరించడం జరిగింది. గీత వృత్తిలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి,గౌడలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుటకై గౌడలంతా ఒకతాటి మీదకు రావాలని అన్నారు. జేఏసీఆధ్వర్యంలో త్వరలో బారి బహిరంగా సభ నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు ఆగపాటి రాజ్ కుమార్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, వల్లల జగన్ గౌడ్, కోతి సాంబరాజు గౌడ్, బొల్లికొండ యాదగిరి గౌడ్, ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్, అటికం రవీందర్ గౌడ్, బొల్లికొండ వినోద్ కుమార్ గౌడ్, భాస్కర్ గౌడ్, జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, బొల్లెపెల్లి రవీందర్ గౌడ్, ముంజాల బిక్షపతి గౌడ్, ఏరుకొండ పవన్ గౌడ్, ముత్యాల యుగేందర్ గౌడ్, ముక్కెర హరినాథ్ గౌడ్, తాళ్లపెల్లి నరేష్ గౌడ్, అల్లం శ్రీనివాస్ గౌడ్, గాజర్ల తిరుపతి గౌడ్,అల్లం మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.