29.7 C
Hyderabad
May 2, 2024 05: 03 AM
Slider విశాఖపట్నం

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్లాన్

#gvlnarasimharao

బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తరచూ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు….. ఎందుకు? ఎందుకంటే ఈసారి ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ మేరకు ఆయనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారట. ఎన్నికలలో పోటీ చేసేందుకు జీవీఎల్ వెనకడుకు వేసినా ఆయన బలవంతం మేరకు  ఎక్కువ భాగం వైజాగ్ లో పర్యటన లు చేస్తున్నారని అంటున్నారు.

బస్తి పర్యటన లు చేస్తూ స్థానిక నేతలు, కార్యకర్తలతో మమేకం అవుతున్నారు జీవిల్…మరో వైపు వైకాపా నుండి సిట్టింగ్ ఎంపీ ఎంవివినే మళ్లీ ఆ సీటుకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆయనపై భూ కుంభకోణం ఆరోపణలు ఎక్కువ కావడంతో ఆయనను పక్కన పెట్టి టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డిని రంగంలో దించుతారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ భూ కుంభకోణం ఆరోపణలు వచ్చినా కూడా సిట్టింగ్ ఎంపినే వైసీపీ ఖరారు చేసింది.

మరో వైపు టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ సీటును ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించాలని చూస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చేయాలని జనసేన నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. చివరకు ఆయన ఏం చేస్తారనేది స్పష్టం కాలేదు. ఒక వేళ పవన్ కల్యాణ్ పోలీ చేయకపోతే పల్లా శ్రీనివాస్ రావు ని పోటీలోకి దించాలని టీడీపీ భావిస్తుంది.

రామకృష్ణ పూడి, సత్యంన్యూస్.నెట్, విశాఖపట్నం

Related posts

యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన దొడ్ల

Satyam NEWS

అమెరికా ఆంక్షలకు చైనా ప్రతీకార చర్యలు

Satyam NEWS

చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Bhavani

Leave a Comment