తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి గుడిహత్నూర్ కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు, యువకులు ఘనంగా స్వాగతం పలికారు.
బ్యాండ్ మేళాలతో ఆయనకు స్వాగతం ఏర్పాటు చేశారు. టపాసులు పేల్చుతూ పూలు చల్లుతూ బస్టాండ్ వరకు ఊరేగింపుగా వచ్చిన బండి సంజయ్ అక్కడ పార్టీ జెండాను ఎగురవేశారు.
అనంతరం మాట్లాడుతూ రజాకార్ల చేతిలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన వెంట ఎంపీ సోయం బాపురావ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, గుడిహత్నూర్ జడ్పిటిసీ పతంగే బ్రహ్మానంద్, పి ఏ సి ఎస్. చైర్మన్ ముండే సంజీవ్ జిల్లా మండల నాయకులు ఉన్నారు.