నటి శ్రావణి ఆత్మహత్య తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్నేహితుడు దేవరాజు రెడ్డి వెల్లడించాడు. శ్రావణి తనను ఇష్టపడిందని అందుకే తనకు ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు. కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. శ్రావణికి సాయి అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుండి పరిచయం ఉందన్నారు. తాను సంవత్సరం క్రితమే శ్రావణికి పరిచయం ఆయన వివరించారు. ‘‘మా నాన్న, అమ్మ చాలా దారుణంగా కొట్టారు. మా తమ్ముడు నన్ను హింసించాడు.
సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. వీళ్ల మొహాలు జీవితంలో చూడదలుచుకోలేదు. నా చావుకు కారణం సాయి అనే వ్యక్తి’’ అంటూ చివరిగా శ్రావణి తనతో చెప్పిందని దేవరాజురెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.